News April 7, 2025

ఆ నలుగురితో మళ్లీ ఆడాలనుకుంటున్నా: ధోనీ

image

మళ్లీ అవకాశం వస్తే సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్‌లతో కలిసి ఆడాలనుకుంటున్నట్లు ధోని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు ఆడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2007 T20WCలో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో యువరాజ్ ఆరు సిక్సర్లపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని, ఇండియన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

ఇల్లు లేదా.. GOOD NEWS తెలిపిన బాపట్ల కలెక్టర్

image

జిల్లాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు స్థల సేకరణలో తగు చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. బాపట్ల జిల్లాలోని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలోని బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాల్లో సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 25, 2025

బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు?: శివాజీ

image

సినిమా టికెట్ ధరల పెంపుపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇండస్ట్రీలో 95శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు. ఇక్కడ అందరికీ లగ్జరీ లైఫ్ అంటూ ఉండదు. మూవీ టికెట్ రేట్లు పెరిగాయి అంటున్నారు. సంక్రాంతి టైమ్‌లో బస్సు ఛార్జీలు 3 రెట్లు పెంచుతారు. అప్పుడు ఎందుకు ఎవరూ మాట్లాడరు? అదే మూవీ టికెట్ రేటు పెరగ్గానే విలన్‌లా చూస్తారు. ఇది కరెక్ట్ కాదు’ అని శివాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మీ కామెంట్?

News November 25, 2025

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.