News April 7, 2025

ఆ నలుగురితో మళ్లీ ఆడాలనుకుంటున్నా: ధోనీ

image

మళ్లీ అవకాశం వస్తే సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్‌లతో కలిసి ఆడాలనుకుంటున్నట్లు ధోని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు ఆడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2007 T20WCలో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో యువరాజ్ ఆరు సిక్సర్లపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని, ఇండియన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

Similar News

News April 9, 2025

రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

రేపటి నుంచి ఈ నెల 12 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ సేవ, 10-12 తేదీల మధ్యలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.

News April 9, 2025

ఒకే జిల్లాల్లో 13,500మందిలో క్యాన్సర్ లక్షణాలు!

image

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో సర్కారు నిర్వహించిన ‘సంజీవని అభిమాన్’ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 13,500కు పైగా మహిళలు క్యాన్సర్ ముప్పు ముంగిట ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ అభివన్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘7వేలమందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, 3500మందిలో రొమ్ము క్యాన్సర్, 2వేల మందిలో నోటి క్యాన్సర్, వెయ్యి మందిలో ఇతర క్యాన్సర్ల లక్షణాల్ని వైద్యులు గుర్తించారు’ అని తెలిపారు.

News April 9, 2025

బ్రిటన్ యువరాజు ప్రాణాలకు ముప్పు: లాయర్

image

బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది ఫాతిమా లండన్ కోర్టుకు తెలిపారు. హ్యారీ తన భార్యతో కలిసి 2020లో అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన బ్రిటన్ వచ్చినప్పుడు కల్పించే భద్రతను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హ్యారీ కోర్టును ఆశ్రయించారు. ‘హ్యారీని చంపాలంటూ ఆల్ ఖైదా ఈమధ్యే పిలుపునిచ్చింది. ఇక ఆయన్ను, ఆయన భార్యను మీడియా డేగలా వెంటాడుతోంది’ అని ఫాతిమా వివరించారు.

error: Content is protected !!