News February 19, 2025
ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దు: ఈటల

TG: కాంగ్రెస్ పాలనలో అధికారుల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్లు నేతలకు బానిసల్లా పనిచేయొద్దని అన్నారు. ప్రభుత్వాలు ఐదేళ్లే ఉంటాయని, ఐఏఎస్లు 35 ఏళ్లు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేతలకు అనుగుణంగా పనిచేసేవారు గతంలో జైలు పాలయ్యారని చెప్పారు. తాము కాషాయ బుక్ మెంటైన్ చేస్తున్నామని, అలాంటి వారు కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.
Similar News
News November 23, 2025
NRPT: భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడి మశ్చీందర్ బాగ్లి మృతి

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడు మశ్చీందర్ బాగ్లి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణ మండలం హిందూపూర్కి చెందిన మశ్చీందర్ భూ నిర్వాసితుల పక్షాన నిలబడి అనతి కాలంలోనే ఓ నాయకుడి ఎదిగారు. 60 రోజుల పాటు భూ నిర్వాసితుల సమస్యలపై వివిధ పార్టీలతో కలిసి సమిష్టిగా పోరాటం చేశారు. ఆయన మరణం జిల్లాలో నిరాశను నింపింది. పలువురు నాయకులు, రైతులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


