News January 30, 2025
ICAI HYD బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ మెంబర్గా ADBవాసి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్యంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) HYD బ్రాంచ్ మేనేజింగ్ కమిటీకి ADBకు చెందిన CA శైలేష్ ఖండేల్వాల్ ఎన్నికయ్యారు. 2025-2029 కాలానికి ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలికి మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా పట్టణానికి చెందిన వ్యక్తి ఎన్నికకావడం విశేషమైంది. ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
Similar News
News February 19, 2025
బజార్హత్నూర్లో మృతదేహం లభ్యం

బజార్హత్నూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ శవం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2025
ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 19, 2025
ADB: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడి ADB, KNR, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.