News March 10, 2025

ICC ఛాంపియన్స్ ట్రోఫీ టీం.. రోహిత్‌కు దక్కని చోటు

image

CT-2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ICC ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. కెప్టెన్‌గా సాంట్నర్(NZ)ను తీసుకుంది. IND నుంచి కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, షమీ, వరుణ్, అక్షర్ పటేల్(12వ ప్లేయర్)లకు చోటిచ్చింది. రచిన్, ఇబ్రహీం, ఫిలిప్స్, అజ్మతుల్లా, హెన్రీలను మిగతా సభ్యులుగా చేర్చింది. అయితే తన కెప్టెన్సీతో INDను ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

Similar News

News November 20, 2025

HYD: BRS ఆఫీస్ మూత.. ఫాంహౌస్ వద్దే మీ నేత: కాంగ్రెస్

image

BRS, KCR, KTR టార్గెట్‌గా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘జూబ్లీహిల్స్‌లో ఓటమే మీ శాశ్వత పతనానికి నాంది KTR.. GHMCపై మీరు ఆశలు పెట్టుకోవడం అంటే ఎండమావిలో నీళ్లు తాగినట్టే.. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే దూరంకొట్టిన్రు.. మరికొద్దిరోజుల్లోనే మీ పార్టీ ఆఫీస్ మూత.. ఫాంహౌస్ వద్దే మీ నేత’ అని పేర్కొంది. కాగా GHMC ఎన్నికల్లోనూ BRSను చిత్తుగా ఓడిస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

News November 20, 2025

ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్‌ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.

News November 20, 2025

తిరుమలలో గంటల శబ్దం వచ్చేది ఇక్కడి నుంచే..

image

తిరుమల వేంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటల శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ గంటలున్న మండపాన్ని తిరుమామణి అని అంటారు. ఇందులో ముఖ్యంగా రెండు గంటలు ఉంటాయి. మొదటిది నారాయణ గంట. రెండవది గోవింద గంట. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ మండపాన్ని సామాన్య శకం 1417వ సంవత్సరంలో మాధవదాసు అనే భక్తుడు నిర్మించాడు. స్వామివారి నివేదన వేళ ఆయన్ను స్మరించుకోవడానికి ఈ మండపం ఒక ముఖ్యమైన భాగం. <<-se>>#VINAROBHAGYAMU<<>>