News January 25, 2025
ఐసీసీ మెన్స్ టీ20 టీమ్.. కెప్టెన్గా రోహిత్
మెన్స్ టీ20 టీమ్-2024ను ఐసీసీ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంచుకుంది. భారత్ నుంచి రోహిత్తో పాటు హార్దిక్, బుమ్రా, అర్ష్దీప్కు చోటు దక్కింది. 2024 టీ20 WCలో 378 రన్స్ చేసిన రోహిత్, టోర్నీ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీమ్: రోహిత్(C), హెడ్, సాల్ట్, బాబర్ ఆజమ్, పూరన్(WK), సికందర్ రజా, హార్దిక్, రషీద్ ఖాన్, హసరంగ, బుమ్రా, అర్ష్దీప్.
Similar News
News February 5, 2025
ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కన్నుమూత
ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత ఆగా ఖాన్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్ వర్క్ Xలో వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఆగా ఖాన్కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన ఇమామ్గా బాధ్యతలు స్వీకరించారు.
News February 5, 2025
పట్టణాలు చిన్నవే కానీ లగ్జరీ షాపింగ్లో టాప్!
భారత్లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్లైన్లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ‘వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్ను ఖర్చుకు వెనుకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రిసెర్చ్ చేశాకే కొనుగోలు చేస్తున్నారు’ అని వెల్లడించింది.
News February 5, 2025
APPLY NOW.. తెలుగు రాష్ట్రాల్లో 13,762 ఉద్యోగాలు
నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్(NRDRM) తెలుగు రాష్ట్రాల్లో 6,881 ఉద్యోగాల చొప్పున పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్-పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఆధారంగా అర్హులుగా పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399 దరఖాస్తు ఫీజు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <