News November 12, 2024
ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు వీరికే..

ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(OCT)గా పాక్ స్పిన్నర్ నోమన్ అలీ, ఉమెన్స్ విభాగంలో అమేలియా కెర్(కివీస్) ఎంపికయ్యారు. ENGతో టెస్టు సిరీస్లో నోమన్ 13.85 యావరేజ్తో 20 వికెట్లు పడగొట్టారు. దీంతో రబడ, శాంట్నర్ను అధిగమించి అవార్డు పొందారు. అమేలియా ఉమెన్స్ T20 వరల్డ్ కప్తో సహా అక్టోబర్లో 19 వికెట్లు కూల్చి, 160 రన్స్ చేశారు. డియాండ్రా డాటిన్, లారా వోల్వార్డ్తో పోటీ పడి అవార్డు గెలుచుకున్నారు.
Similar News
News March 10, 2026
ఎల్ నినో.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: వీసీ

AP: ఈ ఏడాది ఏప్రిల్ వరకు ENSO(ఎల్ నినో+లా నినా) పరిస్థితులకు అవకాశం ఉందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ జయలక్ష్మీ దేవి వెల్లడించారు. జులై తర్వాత <<19250011>>ఎల్ నినోకు<<>> 60 శాతం ఛాన్స్ ఉందని తెలిపారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు. నష్టాలను నివారించడానికి వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలన్నారు.
News March 10, 2026
1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1,900 మంది ఇరాన్ సైనికులు, కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్నూ టార్గెట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్, హెజ్బొల్లా దాడుల్లో ఇజ్రాయెల్లో 12 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలిపింది. గాయపడిన వారిలో 2,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, 91 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.
News March 10, 2026
BREAKING: రూ.10వేలు పెరిగిన KG వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.1,48,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


