News April 15, 2025

ICC POTM అవార్డులు.. ఎవరికెన్నంటే?

image

శ్రేయస్ అయ్యర్ ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ ‌అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ అవార్డును 8 మంది భారత క్రికెటర్లు సాధించారు. శుభ్‌మన్ గిల్ 3, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రెండేసి సార్లు ఎంపికవ్వగా, పంత్, అశ్విన్, భువనేశ్వర్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్ ఒక్కోసారి ఎంపికయ్యారు.

Similar News

News April 17, 2025

రోజూ ఆకుకూరలు తింటే ఇన్ని లాభాలా?

image

రోజూ ఆకుకూరలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘పాలకూరతో గుండెపోటు రిస్కు తగ్గుతుంది. కొత్తిమీర కొలస్ట్రాల్ లెవెల్స్‌ను 10-15% తగ్గిస్తుంది. మెంతిలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించి బ్రెస్ట్ & ప్రొస్టేట్ క్యాన్సర్‌ రిస్కును తప్పిస్తుంది. గోంగూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు.

News April 17, 2025

అందంగా ఉంటేనే అవకాశాలు రావు: తమన్నా

image

అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు నచ్చదని హీరోయిన్ తమన్నా అన్నారు. అందంపై శ్రద్ధ ఉండాలి కానీ, అదే సినిమా ఛాన్సులు తీసుకువస్తుందంటే తాను నమ్మనని చెప్పారు. ‘‘మిల్కీ బ్యూటీ’ ట్యాగ్ నాకు ఫ్యాన్స్ ఇచ్చారు. దీనిని మీడియా మరింత ప్రచారం చేసింది. ఈ ట్యాగ్ వల్ల నా సినిమాల ఛాయిస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల 2’ ఇవాళ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

News April 17, 2025

భూ భారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి

image

TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!