News February 13, 2025

ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు

image

ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్‌ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.

Similar News

News February 6, 2026

శుక్ర దోష నివారణ మార్గాలు

image

శుక్ర దోష నివారణ కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పఠనం చేయాలి. తెల్లని వస్తువులు దానం చేస్తే శుభం కలుగుతుంది. పాలు, పెరుగు, బియ్యం, పంచదార, తెలుపు వస్త్రాలు పేదలకు దానం చేయాలి. ‘ఓం శుం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం, తెలుపు దుస్తులు ధరించడం మంచిది. సుగంధ ద్రవ్యాలు వాడితే శుక్రుడు ప్రసన్నమవుతాడని నమ్మకం.

News February 6, 2026

పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

image

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.

News February 6, 2026

పచ్చిపేడను ఎలా మగ్గబెడితే మంచిది?

image

ముందుగా పశువుల నుంచి వచ్చే పేడను ఒక దగ్గర వేయాలి. అందులో కాస్త తేమ ఉండేందుకు కొద్దిగా నీళ్లను చల్లుతూ ఉండాలి. పేడ బాగా మగ్గాలంటే కుప్పపై గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవరును గట్టిగా కప్పి ఉంచాలి. ఇలా 2 నుంచి 3 నెలల పాటు ఉంచి మధ్యలో అప్పుడప్పుడు కుప్పను పైకి కిందకు తిరగేయాలి. దీని వల్ల ఎరువు సమానంగా కుళ్లి మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన పశువుల ఎరువును వాడితే నేలసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.