News December 11, 2024

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. అగ్రస్థానంలో ఎవరంటే..

image

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. వరస సెంచరీలతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా జో రూట్(897), కేన్ విలియమ్‌సన్ (812), యశస్వీ జైస్వాల్(811), ట్రావిస్ హెడ్(781) నిలిచారు. ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచుల్లో రాణిస్తే జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకునేందుకు ఛాన్స్ ఉంది.

Similar News

News October 31, 2025

చొరబాటుదారుల్ని వెనక్కి పంపిస్తాం: మోదీ

image

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారందరినీ వెనక్కి పంపిస్తామని PM మోదీ పునరుద్ఘాటించారు. చొరబాట్లు దేశ ఐక్యతకు ముప్పుగా మారుతాయని, గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. చొరబాట్లను అడ్డుకొనే వారికి అడ్డుపడుతూ కొన్ని పార్టీలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ‘దేశ భద్రతకు రిస్క్ ఏర్పడితే ప్రతి పౌరుడు ప్రమాదంలో పడినట్లే’ అని ‘ఏక్తాదివస్’లో PM హెచ్చరించారు.

News October 31, 2025

భారత్‌కు బిగ్ షాక్

image

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత టాపార్డర్ కుప్పకూలింది. 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గిల్ 5 రన్స్ చేసి ఔట్ కాగా తర్వాత సంజూ 2, సూర్య 1, తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 9 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 24 రన్స్ చేశారు.

News October 31, 2025

ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత

image

TG: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.