News March 7, 2025
ఈనెల 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 లేట్ ఫీజుతో మే 26 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష ఉంటుంది. జులై 7న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, మిగతా వారికి రూ.750గా నిర్ణయించారు.
Similar News
News April 2, 2026
పంత్ ఓపెనర్గానే రావాలి: అశ్విన్

LSG కెప్టెన్ పంత్ బ్యాటింగ్ పొజిషన్పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా విఫలమైనప్పటికీ పంత్ ఆ స్థానాన్ని వదలొద్దని సూచించారు. పవర్ ప్లే తర్వాత వస్తే బౌలర్లు ఈజీగా కట్టడి చేస్తారని, అందుకే 14 మ్యాచ్ల్లోనూ ఓపెనర్గానే రావాలని కోరారు. కోచ్ లాంగర్, LSG మేనేజ్మెంట్లో ఎవరైనా ఈ విషయంపై పంత్కు నచ్చజెప్పి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించారు.
News April 2, 2026
ఆ థియేటర్లలో ఇక పర్సెంటేజీ సిస్టమ్: ఎగ్జిబిటర్ల నిర్ణయం

TG: రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సెంటేజీ విధానం అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీని ప్రకారం కలెక్షన్లలో తొలివారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% థియేటర్లకు అందనుంది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు అద్దె ప్రాతిపదికన చెల్లింపులు చేసే వారు. దీంతో లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్న తాము నష్టపోతున్నామని సదరు థియేటర్ల ఓనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
News April 2, 2026
కిడ్నీ ముఠా గుట్టురట్టు.. మూవీ తీయొచ్చేమో!

UP కాన్పూర్లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఓ యువకుడు తన కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేందుకు ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక అతనికి రూ.9.5లక్షలే ఇవ్వడంతో మిగిలిన డబ్బు కోసం గొడవ జరిగింది. ఆ కోపంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో అంతర్జాతీయ ముఠా గుట్టురట్టైంది. వీరు రూ.10లక్షలకు కొని రోగికి రూ.60లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.


