News September 23, 2024
భారత్లో ఎంపాక్స్ క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధారణ
కేరళలో గత వారం ఎంపాక్స్ పాజిటివ్గా తేలిన వ్యక్తిలో క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధారణ అయ్యింది. ఈ స్ట్రెయిన్ వల్లే డబ్ల్యూహెచ్ఓ గత నెలలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చిన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ స్ట్రెయిన్ను గుర్తించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News September 23, 2024
రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ2’ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటివరకు భారత్లో రూ.604.22 కోట్లు(నెట్) రాబట్టగా రూ.713 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు తెలిపింది.
News September 23, 2024
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం
TG: రాష్ట్రంలో రేషన్, హెల్త్ ప్రొఫైల్తో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే ఫ్యామిలీ కార్డుగా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, రూరల్ ప్రాంతాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటి మానిటరింగ్కు జిల్లాలవారీగా వ్యవస్థ ఉండాలని సూచించారు. దీని కోసం పలు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు.
News September 23, 2024
వరద పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు
AP: వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. పంట నష్టంపైనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఎల్లుండి నుంచి పరిహారం బాధితులకు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.