News June 16, 2024
ఏకపక్షంగా విగ్రహాలు తరలించారు: ఖర్గే

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని ప్రముఖుల విగ్రహాల తరలింపును కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుబట్టారు. ‘గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలను ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా తొలగించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే. ఎన్నో చర్చలు, పరిశీలన తర్వాత అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలను ఇప్పుడు ఒక మూలకు మార్చారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు మన పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు విరుద్ధం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News September 14, 2025
HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<