News December 16, 2025
IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Similar News
News December 17, 2025
100 రోజుల స్టడీ ప్లాన్ ఓకే.. పిల్లల ఆకలి మరీ.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల మంది పదో తరగతి విద్యార్థులకు DEC 6నుంచి 100రోజుల స్టడీ ప్లాన్ అమలు చేస్తున్నారు. స్కూల్ సమయం తర్వాత కూడా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రాత్రి 7గ.ట వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం ఏమీ తినకపోవడంతో విద్యార్థులు నీరసించి, చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాయంత్రం వేళ పాలు, టిఫిన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News December 17, 2025
ఆసుపత్రిలో చేరిన జైస్వాల్

టీమ్ ఇండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఆసుపత్రిలో చేరారు. SMATలో ముంబై తరఫున ఆడుతున్న ఆయన రాజస్థాన్తో మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన కడుపునొప్పికి గురయ్యారు. దీంతో పుణే సమీపంలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. జైస్వాల్ గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, వైద్యపరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా నిన్నటి మ్యాచులో ముంబై 3 వికెట్ల తేడాతో గెలిచింది.
News December 17, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>


