News July 5, 2024
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

AP: కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి, సిగరెట్లను క్యాంపస్లోకి తీసుకెళ్తూ సెక్యూరిటీకి పట్టుబడ్డారు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 3, 2026
IIT బెనారస్లో ఉద్యోగాలు

<
News March 3, 2026
ఇరాన్లో భూకంపం.. అణుకేంద్రాల దగ్గర అలజడి

ఇరాన్లోని గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10km లోతులో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలు సహజసిద్ధమైనవేనని USGS తెలిపింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ భూకంపం రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. గెరాష్కు సమీపంలో ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం, గ్చైన్ యురేనియం గనులకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. యుద్ధం మధ్యలో ఈ భూకంపం భయాందోళనలను రేకెత్తించింది.
News March 3, 2026
అభివృద్ధి చెందాం.. కానీ, శాంతిని మర్చిపోయాం!

టెక్నాలజీ పెరిగింది. నాగరికత శిఖరాగ్రానికి చేరింది. దౌత్యం గొప్పతనాన్ని చరిత్ర చాటిచెప్పింది. మనం సృష్టించిన ఆయుధాలు మనల్నే మింగేసేంత శక్తిమంతమైనవని తెలిసినా.. రక్తపాతాలు ఆగడం లేదు. నాయకుల ఈగోలు, ఆధిపత్య పోరాటాలు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశాల ఉనికిని కాపాడాల్సింది పోయి, యుద్ధాలతో వినాశనాన్ని కొనితెచ్చుకోవడం విషాదం. హింసను ఆపి మనిషిని ప్రేమించే స్పృహ పెరగాల్సిన సమయం ఇది.


