News February 11, 2025
ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్లోని ఎల్వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.
Similar News
News December 1, 2025
విజయ్ నాకు శత్రువు కాదు: కమల్ హాసన్

TVK అధినేత విజయ్ తనకు శత్రువు కాదని సినీ నటుడు, MP కమల్ హాసన్ అన్నారు. కులతత్వమే తన ప్రధాన శత్రువని, దాన్ని అంతమొందించాలని చెప్పారు. కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్, లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘విజయ్కు సలహా ఇచ్చే స్థితిలో నేను లేను. ఇది సరైన సమయం కాదు. అనుభవం మన కన్నా గొప్ప టీచర్. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు. మనకు పక్షపాతం ఉండొచ్చు, కానీ అనుభవానికి ఉండదు’ అని తెలిపారు.
News December 1, 2025
ఇవాళ ఏలూరు జిల్లాలో సీఎం పెన్షన్ల పంపిణీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అటు నల్లమాడులో P4 మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ఉంగుటూరులో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయడానికి ముఖ్య నేతలతో CM భేటీ కానున్నారు. 3.35PMకు జిల్లా పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి బయల్దేరతారు.
News December 1, 2025
నేడు ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు

నేడు ఏకాదశి. ఈ పవిత్ర దినాన కొన్ని పరిహారాలు పాటిస్తే సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. దేవుడి స్మరణలో కాలం గడపాలి. వీలైతే నదీ స్నానం, లేకపోతే నదీజలం కలిసిన నీటితో స్నానం చేయాలి. ఆవునేతితో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. వైష్ణవాలయానికి వెళ్లాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిన దీక్ష విరమించాలి. ఫలితంగా విష్ణుమూర్తి,లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.’


