News April 5, 2024
300 పిల్లర్లలో 3 కుంగిపోతే ప్రళయం వచ్చినట్లు చేస్తున్నారు: KCR

TG: తనను బద్నాం చేయాలనే కుట్రతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని BRS చీఫ్ కేసీఆర్ ఫైరయ్యారు. ‘కాళేశ్వరం గురించి ఈ కాంగ్రెస్ నాయకులకు వెంట్రుక కూడా తెల్వదు. మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బ్యారేజీ నిర్మించాం. 300 పిల్లర్లలో 3 కుంగిపోతే మొత్తం మునిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. చిన్నచిన్న పొరపాట్లు సహజం. మేడిగడ్డ కింద ఇసుక కదిలిపోయింది అంతే. దానికి ఏదో ప్రళయం వచ్చినట్లు హంగామా చేస్తున్నారు’ అని విమర్శించారు.
Similar News
News April 23, 2025
టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
News April 23, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు: పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చ.అ.లకు తగ్గకుండా, 600 చ.అ.లకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
News April 23, 2025
బాధితుల కుటుంబాలను ఆదుకోవాలి: రాహుల్ గాంధీ

పహల్గామ్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో గాయపడ్డ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని, వారికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని Xలో పోస్ట్ చేశారు.