News March 25, 2024
ఏదైనా ఉంటే జడ్జికి చెప్పండి.. EDపై ఆతిశీ ఫైర్

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ ఫోన్లు కనిపించడం లేదని ED పేర్కొనడంపై AAP మంత్రి ఆతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ ఏమైనా చెప్పాలనుకుంటే జడ్జి ముందు చెప్పాలన్నారు. ఈడీ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని ఆమె గుర్తు చేశారు. రాజ్యాంగం ఈడీకి ప్రత్యేక అధికారాలు కల్పించిందని, వాటిని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అవమానించవద్దని ఆమె అన్నారు.
Similar News
News April 6, 2026
భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయా.. అదెలా సర్?

ఉజ్జయినిలో భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2 వేర్వేరు అక్షాంశాల్లో ఉండే లైన్స్ ఎలా కలుస్తాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘భూమధ్య రేఖ(Equator), కర్కాటక రేఖ(Tropic of Cancer).. సమాంతర రేఖలు. అవి కలవవు. మీరు BJPకి ఓటు వేస్తే విద్యావ్యవస్థను తీర్చిదిద్దేది ఇలాంటి వ్యక్తులే’ అని TMC నేత సాకేత్ గోఖలే ఎద్దేవా చేశారు.
News April 6, 2026
రేపే చంద్రుడి సమీపానికి వ్యోమగాములు.. ఫొటోల కోసం వెయిటింగ్!

‘ఆర్టెమిస్-2’ మిషన్ కీలక దశకు చేరుకుంది. రేపు జరగనున్న ‘లూనార్ ఫ్లైబై’ కోసం వ్యోమగాములు సర్వం సిద్ధం చేసుకున్నారని NASA పేర్కొంది. ఇప్పటివరకూ భూమి అద్భుత దృశ్యాలను పంపిన బృందం.. రేపు చంద్రుడిని అత్యంత సమీపం నుంచి ఫొటోలు తీయనుంది. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చందమామ అందాలను దగ్గరగా చూసే సమయం ఆసన్నమైంది. *ఇప్పటివరకూ NASA షేర్ చేసిన ఫొటోలివే..
News April 6, 2026
ఫ్యామిలీతో రష్మిక బర్త్ డే.. ఫొటోలు చూశారా?

నేషనల్ క్రష్ రష్మిక తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి బర్త్ డే కావడంతో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఈ వేడుకను ఎంజాయ్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ కొత్త జంట ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీతో ఎంతో సింపుల్గా ఉన్న ఈ స్టార్ కపుల్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


