News August 8, 2025
బండి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో బండి సంజయ్ చేసిన <<17342231>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి KTR ఫైర్ అయ్యారు. ‘సంజయ్ స్టేట్మెంట్స్ హద్దు మీరాయి. హోంశాఖ మంత్రి అయినా ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందన్న ఇంగిత జ్ఞానం లేదని అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలని ఆయనకు సవాల్ విసురుతున్నా. 48 గంటల్లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపి కోర్టుకు లాగుతా’ అన్నారు.
Similar News
News August 9, 2025
SSC CGL పరీక్షలు వాయిదా

ఆగస్టు 13-30 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఫేజ్-13లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 14,582 గ్రూప్ B, C పోస్టులకు గతంలో SSC నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News August 8, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అల్లూరి జిల్లాలో స్కూళ్ల అభివృద్ధికి రూ.45.02కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
* శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద. ఇన్ ఫ్లో 83,242, అవుట్ ఫ్లో 98,676 క్యూసెక్కులు
* జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత తురకా కిశోర్
* స్వచ్ఛత పక్వాడా అవార్డులు-2024లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న విశాఖ పోర్ట్
* పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించాలని TDP కుట్ర: ఎంపీ అవినాశ్ రెడ్డి
News August 8, 2025
బ్యాటర్ల ఊచకోత.. ముగ్గురు 150+ స్కోర్లు

రెండో టెస్టులో పసికూన జింబాబ్వేపై న్యూజిలాండ్ విరుచుకుపడుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 150కి పైగా పరుగులు చేశారు. కాన్వే 153 రన్స్ చేసి ఔట్ అవ్వగా హెన్రీ నికోల్స్ 150, రచిన్ రవీంద్ర 165 పరుగులతో క్రీజులో ఉన్నారు. యంగ్(74), డఫీ(36) పర్వాలేదనిపించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి NZ 601/3 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే 125 రన్స్కు ఆలౌటైంది.