News October 3, 2024
నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం: Jr.NTR

ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 20, 2025
అభివృద్ధి చిరునామా ORR.. ఇప్పుడు అమరావతి వంతు!

HYD అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్(ORR)ది కీలక పాత్ర. కనెక్టివిటీ పెరగడంతో నివాస, వాణిజ్య సముదాయాలు పెరిగాయి. ఇప్పుడు నూతనంగా ఎదుగుతున్న AP <<18624817>>రాజధాని<<>> అమరావతి ORRకు అడుగులు పడుతున్నాయి. ఇది పూర్తయితే 5 జిల్లాల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్కు ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. అయితే భూసేకరణకు ప్రజల సహకారం ఎలా ఉంటుంది? ఎప్పటికి పూర్తవుతుందనేదే ప్రశ్న!
News December 20, 2025
బడ్జెట్లో మీకేం కావాలి? ప్రభుత్వానికి సలహా ఇవ్వండి..!

కేంద్ర బడ్జెట్ 2026 కోసం భారత ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు కోరుతోంది. దేశాభివృద్ధికి, కొత్త రూల్స్ తయారీకి మీ ఐడియాలను పంచుకోవాలని MyGovIndia Xలో పోస్ట్ చేసింది. అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలనేది ప్రభుత్వ ప్లాన్. ఆసక్తి ఉన్నవారు <
News December 20, 2025
వేంకన్న గుడికి గువాహటిలో 25 ఎకరాలు

AP: గువాహటిలో TTD ఆలయం కోసం 25 ఎకరాలు ఇచ్చేందుకు అస్సాం CM హిమంత బిశ్వశర్మ ఆమోదం తెలిపారు. ‘గతంలో వేరే పట్టణాల్లో స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలన్నది ఆశయమని, ఈశాన్య భారతానికి కేంద్రంగా ఉన్న గువాహటిలో స్థలం కేటాయించాలని CM CBN అస్సాం CMకు లేఖ రాశారు’ అని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భూమితో పాటు ఆర్థిక సహకారం అందించడానికి హిమంత అంగీకరించారని చెప్పారు.


