News November 30, 2024

బోనస్‌ ఇస్తే రైతుబంధు రాదా? ప్రభుత్వం ఏమందంటే!

image

TG: క్వింటా సన్నరకం వరికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతుభరోసాను తొలగిస్తారని చాలా మంది భావిస్తున్నారు. దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సంక్రాంతికి ఎకరాకు రూ.7వేల చొప్పున రైతు భరోసా వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ప్రకటించారు. బోనస్ కొనసాగిస్తూనే రైతుభరోసా కూడా ఇస్తామన్నారు. నేటి రైతు సదస్సులో సీఎం రేవంత్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Similar News

News November 22, 2025

GREAT: బ్యాగులో రూ.10,00,000.. అయినా పైసా ముట్టలేదు!

image

పుణే(MH)కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. గురువారం చెత్త ఏరుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. అందులో డబ్బు, మెడిసిన్లు కనిపించాయి. అది ఎవరిదో కనుక్కునేందుకు ఆ వీధి అంతా తిరిగింది. ఓ వ్యక్తి టెన్షన్‌తో కనిపించడంతో అతడికి వాటర్ ఇచ్చింది. బ్యాగ్ దొరికిందని ఇచ్చేసింది. అందులో రూ.10 లక్షల క్యాష్ ఉంది. దీంతో ఆమె నిజాయతీకి మెచ్చిన బ్యాగ్ యజమాని చీర, కొంత డబ్బు ఇచ్చాడు.

News November 22, 2025

ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

image

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్‌రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.

News November 22, 2025

‘RRR’పై రీసర్వే చేయండి.. గడ్కరీకి కవిత లేఖ

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్‌మెంట్‌పై రీసర్వే చేయాలని కోరుతూ కేంద్రమంత్రి గడ్కరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ‘రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని గ్రామాల్లో అలైన్‌మెంట్‌ను చాలాసార్లు <<18295771>>మార్చారు<<>>. రాజకీయ నేతలు, భూస్వాముల కోసం ఇలా చేశారని స్థానికులు నమ్ముతున్నారు. చిన్న రైతులే నష్టపోతున్నారు’ అని పేర్కొన్నారు. రీసర్వే చేసి, అలైన్‌మెంట్ ఖరారుకు ముందు స్థానికులతో చర్చించాలని కోరారు.