News October 21, 2024
పత్తి రైతులను మోసం చేస్తే చర్యలు: మంత్రి తుమ్మల
TG: రాష్ట్రంలో అన్ని పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం(D) గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కష్టమైన నష్టమైనా ప్రభుత్వం పంట కొనుగోళ్లు చేస్తుందని చెప్పారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
Similar News
News October 21, 2024
అలాంటి వారు ఇక నో ఫ్లై జాబితాలో: రామ్మోహన్ నాయుడు
విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా పరిగణించేలా చట్ట సవరణ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చనున్నట్టు వెల్లడించారు. ఇప్పటిదాకా 75 సంస్థలకు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేరకమైన భాషను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
News October 21, 2024
నందిగం సురేశ్కు 14 రోజుల రిమాండ్
AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 21, 2024
రైలులో టపాసులు తీసుకెళ్లొచ్చా?
దీపావళి సమీపిస్తోంది. చాలామంది పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళుతుంటారు. ఈక్రమంలోనే బాణసంచా కొని ట్రైన్లో తీసుకెళదామనుకుంటారు. అయితే రైల్వే సేఫ్టీ రూల్స్ ప్రకారం మండే స్వభావం ఉన్న ఫైర్ క్రాకర్స్ను రైలులో తీసుకెళ్లడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ స్టవ్స్, సిలిండర్స్, యాసిడ్స్ వంటివి కూడా తీసుకెళ్లడానికి అనుమతి లేదు.