News April 12, 2025

ఓడితే ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే: వెంకయ్య

image

AP: ఒకసారి ప్రజలు ఓటమి తీర్పు ఇచ్చాక ఇష్టమున్నా లేకపోయినా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలకు ఆ ఓపిక ఉండటం లేదని చెప్పారు. తిరుపతిలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ డిబేట్‌లో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వంతో ఎన్ని చర్చలైనా జరపండి. చట్టసభలను మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. అది మనకు మనమే అపకారం చేసుకున్నట్లు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News November 17, 2025

సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

image

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.

News November 17, 2025

సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

image

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.

News November 17, 2025

మరణశిక్ష తీర్పును ఖండించిన హసీనా

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) తనకు విధించిన <<18311087>>మరణశిక్షను<<>> ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వ తీర్పును తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ నమ్మడానికి బంగ్లా ప్రజలేం పిచ్చివాళ్లు కాదని ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.