News December 6, 2024
నాకు సమస్య ఉంటే అతడికే చెబుతాను: నితీశ్

తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి శరవేగంగా భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అతడిపై BCCI స్పెషల్ వీడియో రూపొందించింది. అందులో KL రాహుల్ను నితీశ్ ప్రత్యేకంగా కొనియాడారు. ‘నాకు సమస్య ఉంటే వెంటనే KL భాయ్తో మాట్లాడతాను. ఆయన నుంచి ఎప్పుడూ గుడ్ వైబ్స్ ఉంటాయి. తను ఏ సలహా ఇచ్చినా నాకు వర్కవుట్ అయింది. తొలి టెస్టులో బ్యాటింగ్లో ఆయన సూచనలు పనిచేశాయి’ అని వెల్లడించారు.
Similar News
News December 12, 2025
అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.
News December 12, 2025
రేవంత్-మెస్సీ మ్యాచ్కు రాహుల్ గాంధీ

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శనివారం) హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్లో స్టార్ ప్లేయర్ మెస్సీ పాల్గొనే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించనున్నారు. ఈ మ్యాచ్ను చూసేందుకు రావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్, ప్రియాంక ఇతర నేతలను ఆహ్వానించడం తెలిసిందే. ఈ మ్యాచులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆటగాళ్లు మెస్సీ టీమ్తో పోటీపడనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
News December 12, 2025
డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు: అశ్వినీ వైష్ణవ్

2027 జనగణన నిర్వహణకు ₹11,718 కోట్లను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డేటా రక్షణను దృష్టిలో ఉంచుకుని జనాభా లెక్కల సమాచారం ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2027 జనాభా లెక్కలు మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయన్నారు. 2దశల్లో జనాభా లెక్కలు నిర్వహిస్తారని వివరించారు. ముందు గృహాల గణన, జాబితా తయారీ, ఆపై జనగణన ఉంటుందన్నారు.


