News December 9, 2024
దమ్ముంటే ముందుకొచ్చి విచారించు.. ఆన్లైన్ కేటుగాడికి మహిళ కౌంటర్

Digital Arrest మోసాలు పెరుగుతున్నాయి. ముంబైకి చెందిన మహిళకు ఓ ఫ్రాడ్స్టర్ ఫోన్ చేసి మీ ఆధార్ను ఉపయోగించి ఐదుగురు ₹2 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ బెదిరించాడు. బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పాలని ఆ కేటుగాడు కోరగా, ‘నువ్వు నిజంగా పోలీసువైతే వ్యక్తిగతంగా వచ్చి విచారించు. ఇలా వీడియో కాల్లో కాదు’ అని ఆ మహిళ గట్టిగా మందలించి ఫోన్ కట్ చేసింది. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండండి. Share It.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


