News June 3, 2024
ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ముకేశ్ కుమార్ మీనా

APలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరించారు.
Similar News
News December 11, 2025
కర్నూలు డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్

కర్నూలు విద్యాశాఖ అధికారిగా గురువారం ఎల్.సుధాకర్ బాధితులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ A.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో విద్యార్థుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
News December 11, 2025
హోరాహోరీ.. 3 ఓట్లతో విజయం

TG: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. కొందరు స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సొంతం చేసుకుంటున్నారు. రంగారెడ్డి(D) ఫరూక్నగర్ మండలం శేరిగూడలో కొండం శారద శంకర్గౌడ్ 3 ఓట్లతో గెలుపొందారు. అటు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్లో అన్నాచెల్లెళ్లు బరిలో నిలవగా చెల్లెలు స్రవంతి ఘన విజయం సాధించారు.
News December 11, 2025
కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండండి: మమత

SIR పేరుతో ఓట్లు తొలగిస్తే కనుక అడ్డుకోవడానికి కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండాలని WB CM మమత మహిళలకు పిలుపునిచ్చారు. వారితో పాటే పురుషులూ పోరాడాలన్నారు. ‘మీరు దాడి చేస్తే ఎలా అడ్డుకోవాలో తెలుసు. BIHAR చేయలేకపోయింది. మేము చేసి చూపిస్తాం’ అని BJPని హెచ్చరించారు. ఆ పార్టీ IT సెల్ రూపొందించిన జాబితాతో ఎన్నిక జరపాలని చూస్తోందన్నారు. WB నుంచి ప్రజలను వెళ్లగొట్టేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.


