News June 3, 2024
ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ముకేశ్ కుమార్ మీనా

APలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరించారు.
Similar News
News December 15, 2025
బిగ్బాస్ హౌస్లో టాప్-5 వీళ్లే

తెలుగు బిగ్బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఫైనల్కు మరో వారం మాత్రమే మిగిలి ఉండగా టాప్-5 ఫైనలిస్టులు ఖరారయ్యారు. తనూజ, డిమోన్ పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన ఫైనల్ రేసులోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన డబుల్ ఎలిమినేషన్లో శనివారం <<18553037>>సుమన్శెట్టి<<>> ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆదివారం <<18559680>>భరణి<<>> ఎలిమినేట్ అయ్యారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
News December 15, 2025
ఖమ్మం జిల్లాలో TDP మద్దతుదారు విజయం

TG: ఖమ్మం జిల్లా కామేపల్లి మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ సొంతం చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థి అజ్మీర బుల్లి విజయం సాధించారు. బీజేపీ, BRS, జనసేన పార్టీల మద్దతుతో గెలిచినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం ఆమె భర్త హరినాయక్ సర్పంచ్గా గెలవగా, ఇప్పుడు బుల్లి గెలుపొందారు. కాగా మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుదారులు మూడు పంచాయతీలను సొంతం చేసుకున్నారు.
News December 14, 2025
సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.


