News March 22, 2024
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే?

CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే విద్యాశాఖ మంత్రి ఆతిశీ, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్కు ఆతిశీ అత్యంత సన్నిహితురాలు. సౌరభ్ సైతం చురుగ్గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరనే పేరుంది. వీరికి తోడు కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా వినిపిస్తోంది.
Similar News
News February 23, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <
News February 23, 2025
గ్రూప్-2 వివాదంలో ఎవరి పాత్ర ఎంతంటే?: ఎమ్మెల్సీ చిరంజీవి

AP: గ్రూప్-2 వివాదంలో జగన్ పాత్రే అధికంగా ఉందని టీడీపీ MLC చిరంజీవి ఆరోపించారు. నోటిఫికేషన్ రావడం, రోస్టర్లో తప్పులు, హైకోర్టులో కేసులు జగన్ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. మెయిన్స్ FEB 23న పెట్టాలని హైకోర్టు సూచిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వాయిదా వేయాలని CBN కోరినట్లు తెలిపారు. పరీక్ష వాయిదాతో టీడీపీకి లబ్ధి అని YCP ఫిర్యాదు చేయగా రద్దు కుదరదని APPSC తేల్చినట్లు పేర్కొన్నారు.
News February 23, 2025
ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.