News April 10, 2024

మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది: కిషన్ రెడ్డి

image

TG: మరోసారి మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ది చెందుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా మైనార్టీల ఆత్మగౌరవాన్ని పెంచింది మోదీనే అన్నారు. ఆయన హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారం అయ్యిందన్నారు.

Similar News

News January 28, 2026

డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

image

కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్ వాడడం, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులు ఎత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 28, 2026

బడ్జెట్‌పై BJP అవగాహన సదస్సులు

image

కేంద్ర బడ్జెట్‌పై FEB1 నుంచి దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని BJP నిర్ణయించింది. బడ్జెట్‌ నిర్ణయాలు, వాటి ప్రభావాన్ని ప్రజలకు తెలపనుంది. పదేళ్లలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్‌పై ప్రభుత్వ చర్యలను వివరించనుంది. కేంద్రమంత్రులు, MPలు, రాష్ట్ర నేతలను వీటిలో భాగస్వాములను చేయనుంది. దీనికోసం దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా Ex MP GVL నర్సింహారావును నియమించింది.

News January 28, 2026

ఈ ఉంగరం ధరిస్తే..

image

జ్యోతిషం ప్రకారం పుష్పరాగం ఎంతో పవిత్రమైనది. ఈ రత్నం గురు గ్రహానికి ప్రతీక. జ్ఞానం, సంపద, సంతోషకర వివాహ జీవితం కోసం దీన్ని ధరిస్తారు. మహిళలకు వివాహ జాప్యం తొలగడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం ఇది బాగా పనిచేస్తుందని నమ్మకం. పగుళ్లు లేని, పారదర్శకమైన బంగారు రంగు పుష్పరాగం ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, దైవానుగ్రహం లభిస్తుందట. జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు.