News October 4, 2024

అవసరమైతే ఒక పథకాన్ని ఆపి రైతు హామీలు నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల

image

TG: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతులు ఆదరిస్తేనే తాము అధికారంలోకి వచ్చామని మీడియా సమావేశంలో చెప్పారు. అవసరమైతే ఏదైనా పథకాన్ని ఆపి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కచ్చితంగా రూ.2 లక్షలవరకు రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

Similar News

News March 4, 2025

INDvAUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

News March 4, 2025

అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

image

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్‌ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్‌కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్‌వర్క్‌లో చేరి ఆన్‌లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.

News March 4, 2025

మద్య నిషేధం ఉన్నప్పటికీ 4 సెకండ్లకో బాటిల్ సీజ్!

image

గుజరాత్‌లో మద్య నిషేధ చట్టం అమలవుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఆల్కహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. కానీ, అక్కడ ప్రతి 4 సెకండ్లకు ఓ లిక్కర్ బాటిల్ సీజ్ అవుతోంది. 2024లో రూ.144 కోట్లు విలువ చేసే దాదాపు 82 లక్షల బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్‌ సిటీ & రూరల్‌లోనే 4.38 లక్షల బాటిళ్లు సీజ్ అయ్యాయి. వినూత్నంగా స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ పోలీసులు వారిని గుర్తిస్తున్నారు.

error: Content is protected !!