News November 10, 2024
డిసెంబర్ 31లోగా చేయకపోతే..

ఫిన్టెక్ సంస్థలు కస్టమర్ల ప్రొఫైల్ను రూపొందించడం కోసం పాన్ సమాచారాన్ని వాడుతుండటంతో ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకు డిసెంబర్ 31 వరకు గడువునిచ్చింది. లింక్ చేయని పక్షంలో పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇన్కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.
Similar News
News November 26, 2025
18 ఏళ్ల యువతను గౌరవిద్దాం: మోదీ

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందని PM మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘18ఏళ్లు నిండి, తొలిసారి ఓటు వినియోగించుకునే యువతను ఏటా NOV 26న విద్యాసంస్థల్లో గౌరవించాలి. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయన్న గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి’ అని పేర్కొన్నారు.
News November 26, 2025
BREAKING: భారత్ ఘోర ఓటమి

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ భారత్ ఘోర ఓటమిపాలైంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్సులో 140 స్కోరుకే ఆలౌటైంది. జడేజా(54) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. సైమన్ 6, కేశవ్ 2, ముత్తుసామి, మార్కో చెరో వికెట్ తీశారు. దీంతో సఫారీలు 408 రన్స్ తేడాతో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేశారు.
స్కోర్లు: SA.. 489/10, 260/5(డిక్లేర్డ్), IND.. 201/10, 140/10
News November 26, 2025
2033 నాటికి 150 లక్షల టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం

AP: పాల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 2033 నాటికి తొలి 3 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని.. 2033 నాటికి దీన్ని 150 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.


