News July 7, 2024

పెన్షన్లు పెంచితే ఏటా రూ.22వేల కోట్లు అవసరం

image

TG: రాష్ట్రంలో చేయూత పథకం కింద పెన్షన్ల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వృద్ధాప్య, ఇతర కేటగిరీల పింఛన్‌దారులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేల చొప్పున ఇస్తే ఏటా రూ.22వేల కోట్ల అవసరమని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అంచనా వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క నేతృత్వంలో జరిగిన బడ్జెట్ సన్నాహక భేటీలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Similar News

News October 24, 2025

భారీగా తగ్గిన వెండి ధరలు

image

వరుసగా నాలుగో రోజు కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై ధర రూ.3 వేలు తగ్గి రూ.1,71,000 వద్ద కొనసాగుతోంది. నాలుగు రోజుల్లోనే సిల్వర్ ధరలు కిలోకి రూ.19 వేలు తగ్గడం గమనార్హం. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.1,25,460 వద్ద కొనసాగుతోంది. 22K 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.1,15,000గా ఉంది.

News October 24, 2025

మద్దతు ధరపై పత్తి రైతుల్లో ఆందోళన

image

ఈ ఏడాది పత్తి పంట క్వింటాకు రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పంటలో తేమ, నాణ్యత ఉంటేనే ఈ ధర వస్తుంది. పత్తిలో గరిష్ఠంగా 8-12% తేమనే CCI అనుమతిస్తోంది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు, చీడపీడల వల్ల ఈసారి పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో పాటు నాణ్యత కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల మద్దతు ధర దక్కుతుందో? లేదో? అనే ఆందోళన పత్తి రైతుల్లో నెలకొంది.

News October 24, 2025

ఎంపీ vs ఎమ్మెల్యే.. కారణం ఇదేనా?

image

AP: విజయవాడ MP చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ముదురుతోంది. కొలికపూడి గెలుపు కోసం ₹18 కోట్లు ఖర్చు చేశానని, వచ్చే ఎన్నికల్లో TDP నేత జవహర్ కొడుకు పోటీ చేస్తారని చిన్ని చెప్పడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఆత్మగౌరవానికి భంగం కలగడంతోనే <<18082832>>ఇలా మాట్లాడాల్సి<<>> వస్తోందని MLA చెప్తున్నారు. 12 నెలలుగా దేవుడని, ఇప్పుడు దెయ్యమని ఎందుకంటున్నారో చెప్పాలని చిన్ని ప్రశ్నిస్తున్నారు.