News September 3, 2024

ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా?: సీఎం

image

AP: రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని CM చంద్రబాబు ఆరోపించారు. ‘వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు ఘటనను రైజ్ చేస్తారా? బుద్ధి, జ్ఞానం ఉందా? ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపైనా విచారణ చేస్తాం. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటాం. బాబాయిని చంపి నారాసుర రక్తచరిత్ర అని రాసినవారు ఉన్నప్పుడు అనుమానాలొస్తాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై అధికారులు జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పారు.

Similar News

News November 17, 2025

ఏపీలో అణువిద్యుత్ ప్రాజెక్ట్.. పరిశీలిస్తున్న NTPC!

image

విద్యుదుత్పత్తి సంస్థ NTPC 700, 1000, 1,600 మెగావాట్ల కెపాసిటీతో అణువిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం AP, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. 2047 నాటికి 30K మె.వా. విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌కు రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.

News November 17, 2025

డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

image

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ వంటి పశుగ్రాసాలను సాగుచేయాలి. అలాగే సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. ✍️మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 17, 2025

ఎయిర్ లైన్స్ మొదటి మహిళా CEO

image

ఎయిర్‌ ఇండియా తొలి మహిళా పైలట్‌ హర్‌ప్రీత్‌ ఒక ఎయిర్ లైన్స్‌కి మొదటి మహిళా CEOగా నిలిచి రికార్డు సృష్టించారు. 1988లో ఎయిర్ ఇండియాలో చేరిన హర్‌ప్రీత్ ‘ఎయిర్‌ ఇండియా’ సహాయక సంస్థ అయిన ‘అలయెన్స్‌ ఎయిర్‌’కి సీఈవోగా ఉన్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె ‘ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్‌ అకాడమీ’ నుంచి వాణిజ్య విమానాల పైలట్‌గా శిక్షణ పొందారు. విమానయానంలో కెరీర్‌ను ఎంచుకున్న మహిళలకు మార్గదర్శకంగా ఉంటున్నారు.