News June 19, 2024

వయనాడ్‌లో గెలిస్తే ప్రియాంక అరుదైన రికార్డు

image

రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో ఆమె గెలిస్తే తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. అంతేకాక గాంధీ కుటుంబంలో దక్షిణాది నుంచి గెలిచిన మూడో వ్యక్తిగా చరిత్రకెక్కుతారు. దీంతో పాటు పార్లమెంటులో తొలిసారిగా సోనియా, రాహుల్, ప్రియాంక ఒకేసారి సభ్యులుగా ఉండనున్నారు.

Similar News

News December 14, 2025

సర్పంచ్ రిజల్ట్స్: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా

image

TG: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో BRS కంటే ఎక్కువ సీట్లు కమలం పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.

News December 14, 2025

సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. తీరా రిజల్ట్ చూస్తే..

image

TG: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మం. పీపడ్‌పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు (35) ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన.. ప్రచారానికి డబ్బులు లేకపోవడం, పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటంతో అయ్యప్ప మాలలో ఉండగానే ఉరేసుకున్నాడు. అయితే ఇవాళ్టి ఫలితాల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.

News December 14, 2025

ఏపీలో ₹లక్ష కోట్లతో ‘సాగర్‌మాల’ ప్రాజెక్టులు

image

AP: ‘సాగర్‌మాల’ కింద APలో ₹లక్ష కోట్లతో 110 ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక వృద్ధికి వీలుగా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో పేర్కొంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆధునీకరణ, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంపు, కోస్టల్ కమ్యూనిటీ, షిప్పింగ్, జలమార్గాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో తీరప్రాంతం లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని పేర్కొంది.