News November 25, 2024
లగచర్లకు రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారు: KTR

TG: ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని KTR అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడటానికి సమయం లేదా అని సీఎంను ప్రశ్నించారు. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారని, అదే రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారని చెప్పారు. అదానీ, అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పని చేస్తున్నారని మహబూబాబాద్లో ఫైరయ్యారు.
Similar News
News November 25, 2025
MHBD: రుణాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిర మహిళ చీరల పంపిణీ MHBD పట్టణంలో నిర్వహించారు. అనంతరం వడ్డీ లేని రుణాలు రూ.2.70 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు.
News November 25, 2025
పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

రిఫైన్డ్ ఫ్లోర్తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
News November 25, 2025
జుబీన్ గార్గ్ను హత్య చేశారు: సీఎం హిమంత

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం CM హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల జుబీన్ ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తొలి నుంచీ ఆయన కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈక్రమంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.


