News November 25, 2024

లగచర్లకు రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారు: KTR

image

TG: ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని KTR అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడటానికి సమయం లేదా అని సీఎంను ప్రశ్నించారు. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారని, అదే రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారని చెప్పారు. అదానీ, అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పని చేస్తున్నారని మహబూబాబా‌ద్‌లో ఫైరయ్యారు.

Similar News

News November 12, 2025

త్వరలో రూ.10వేల పరిహారం: తుమ్మల

image

రాష్ట్రంలో మొంథా తుఫాన్ కారణంగా లక్షా 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 23,580, వరంగల్‌లో 19,736 ఎకరాల నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందాన్ని పర్యటించమని కోరామన్నారు. దెబ్బతిన్న పంటలకు త్వరలోనే ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

News November 12, 2025

ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ!

image

TG: ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి రావడంతో వచ్చే ఏడాది నుంచి సీట్ల భర్తీని ఆన్‌లైన్ విధానంలో చేయాలని చూస్తోంది. దీంతో విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకోవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30వేలకు పైగా మేనేజ్‌మెంట్ సీట్లు ఉన్నాయి.

News November 12, 2025

‘ఉరి’ని తొలగించడంపై SCలో JAN 21న విచారణ

image

నేరాలకు విధించే మరణశిక్షలో ఉరితీసే పద్ధతిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 2026 జనవరి 21కి వాయిదా వేసింది. ఎక్కువ బాధను కలిగించే ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్, విద్యుత్ షాక్ తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పిటిషనర్ కోరారు. అయితే విచారణ వచ్చే ఏడాది చేపట్టాలన్న అటార్నీ జనరల్ వెంకటరమణి విజ్ఞప్తితో SC వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.