News July 17, 2024

అలాగైతే కేజ్రీవాల్ నిద్ర నుంచి లేవకపోవచ్చు: లాయర్

image

ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న CM కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వీ అన్నారు. కేజ్రీవాల్ నిద్రలో ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ 50కి పడిపోయాయని, ఇలా అకస్మాత్తుగా పడిపోవడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇలాగైతే ఆయన నిద్ర నుంచి లేవలేరని ఢిల్లీ హైకోర్టుకు వివరించారు. మరోవైపు మార్చి 21న అరెస్టయినప్పటి నుంచి కేజ్రీవాల్ 8.5KGల బరువు తగ్గారని AAP నేత సంజయ్ సింగ్ అన్నారు.

Similar News

News January 28, 2026

‘మెగా’ ఇంటికి ట్విన్స్ రాక కోసం డేట్ ఫిక్స్?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈనెల 31న కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీమంతం సమయంలో ఇన్‌స్టా పోస్ట్‌తో తాను కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఉపాసన <<18084618>>హింట్<<>> ఇచ్చారు. కాగా 2023 జూన్‌లో వీరికి క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. వారసుడొస్తున్నాడంటూ ఫ్యాన్స్ Xలో సందడి చేస్తున్నారు.

News January 28, 2026

వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య: రామ్మోహన్

image

మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేదని ఆయన వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. మరోవైపు కాసేపట్లో రామ్మోహన్ ఘటనాస్థలికి వెళ్లనున్నారు. MHలోని బారామతిలో ఈ ఉదయం ఫ్లైట్ క్రాషై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే.

News January 28, 2026

మహిళా పైలట్‌పై అజిత్ పవార్ ట్వీట్.. వైరల్

image

మహారాష్ట్రలో జరిగిన <<18980548>>ప్రమాదంలో<<>> అజిత్ పవార్‌తోపాటు మహిళా పైలట్ శాంభవీ పాఠక్ మరణించడం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు సజావుగా ల్యాండ్ అయితే.. పైలట్‌గా ఉన్నది ఓ మహిళ అని అర్థం చేసుకోవాలి’ అని 2024 జనవరి 18న ఆయన ట్వీట్ చేశారు. #NCPWomenPower అని హాష్‌ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.