News June 30, 2024
అలా జరిగితే ఉచిత విద్యుత్ ఉండదు: జగదీశ్ రెడ్డి

TG: విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీకి CM రేవంత్ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే పేదవారికి, రైతులకు ఉచిత విద్యుత్, సబ్సిడీ ఉండవన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గలేదన్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 12, 2025
హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి: CBN

AP: అత్యంత హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందుతుందని CM CBN ఆకాంక్షించారు. తూర్పునావికాదళ కేంద్రంగా, టూరిజమ్ హబ్గా ఉన్న విశాఖ ఇప్పుడు ఐటీ, ఏఐ, టెక్నాలజీ, నాలెడ్జ్ సిటీగా మారుతోందని అభివర్ణించారు. కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు భూమి పూజచేశామని, ఏడాదిలో 25వేల మందికి అవకాశాలు వచ్చి ఇక్కడినుంచి పనిచేయగలుగుతారని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభం కానుందని, మెట్రో కూడా వస్తుందని చెప్పారు.
News December 12, 2025
OTTలోకి రెండు కొత్త సినిమాలు

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ’12A రైల్వే కాలనీ’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించారు. నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. అటు దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ నటించిన ‘కాంత’ మూవీ నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా NOV 14న విడుదలవగా మిక్స్డ్ టాక్ వచ్చింది.
News December 12, 2025
AAIలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<


