News June 30, 2024
అలా జరిగితే ఉచిత విద్యుత్ ఉండదు: జగదీశ్ రెడ్డి

TG: విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీకి CM రేవంత్ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే పేదవారికి, రైతులకు ఉచిత విద్యుత్, సబ్సిడీ ఉండవన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గలేదన్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 24, 2025
చలాన్ చెల్లించాలనే SMS వచ్చిందా?

సైబర్ నేరగాళ్లు ఫేక్ ఈ-చలాన్ SMSలు పంపుతూ దోచుకుంటున్నారు. నిన్న కూడా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫేక్ SMSలో ఉన్న లింక్ను క్లిక్ చేసి రూ.6లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ వెబ్సైట్ అఫీషియల్ పోలీస్ పోర్టల్ను పోలి ఉండటంతో అతను రూ.500 ఫైన్ చెల్లించేందుకు యత్నించాడు. ఆ సమయంలో క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.6లక్షలు విత్డ్రా అయ్యాయి. SMSలో ఉన్న లింక్స్తో ఫైన్ చెల్లించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News December 24, 2025
OLA, UBERతో పోలిస్తే ‘భారత్ టాక్సీ’ ప్రత్యేకత ఏంటంటే?

ఢిల్లీలో కేంద్రం పైలట్ ప్రాజెక్ట్ కింద ‘<<18588410>>భారత్ టాక్సీ<<>>’ యాప్ తెస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనూ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, వెహికల్ ట్రాకింగ్, 24/7 కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఓలా, ఉబర్, ర్యాపిడోకి భిన్నంగా ఈ యాప్లో డ్రైవర్, రైడర్స్ సేఫ్టీ కోసం ఢిల్లీ పోలీసులతో టైఅప్ అయ్యారు. వీటికి అదనంగా ‘ఈ యాప్లో ఎలాంటి కమీషన్లు తీసుకోరు. ట్రిప్ అమౌంట్ మొత్తం డ్రైవర్కే వెళ్తుంది’ అని PTI పేర్కొంది.
News December 24, 2025
ఎడారిలో మంచు: ప్రకృతి ఇస్తున్న డేంజర్ సిగ్నల్!

సౌదీ ఎడారిలో మంచు కురవడం అందంగా అనిపించినా అది భూమి మనకిస్తున్న గట్టి వార్నింగ్. వాతావరణ మార్పుల వల్ల వేడి పెరగడమే కాదు ప్రకృతి గతి తప్పడం దీనికి అసలు కారణం. మన ఇండియాకూ ఇది ప్రమాద సంకేతమే. పెరిగిన ఎండలు, అకస్మాత్తుగా భారీ వర్షాలు, వరదలే ఇందుకు నిదర్శనం. ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నగరాల నిర్మాణం, వ్యవసాయం పట్ల కొత్తగా ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


