News November 25, 2024
అదే జరిగితే నేడు రూ.10లక్షల కోట్ల లాభం!

మహారాష్ట్రలో మహాయుతి విజయంతో నిఫ్టీ 400, సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే నేడు ఇన్వెస్టర్లు రూ.10L కోట్లమేర లాభం పొందుతారు. కేంద్ర పాలసీలకు అనుగుణంగా ఉండే కంపెనీల షేర్లలో వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో BJP అనుకూల ప్రమోటర్లున్న కంపెనీలపై ఆసక్తి పెరిగింది. APలో NDA గెలిచినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకడం తెలిసిందే.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


