News September 8, 2024
ఆర్మీ వాళ్లే వెళ్లలేకపోతే వాలంటీర్లు వెళ్తారా?: టీడీపీ

AP: విజయవాడలో వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది వెళ్లలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, అలాంటప్పుడు వాలంటీర్లు ఎలా వెళ్తారని వైసీపీని టీడీపీ ప్రశ్నించింది. ప్రభుత్వంపై బురద జల్లడం ఆపి, వాస్తవిక ప్రపంచంలో బతకాలని ట్వీట్ చేసింది. ‘వేల మంది ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొంటే జగన్కు కనిపించదు. ఒక మాజీ సీఎంలా ప్రవర్తించు. హుందాగా ఉంటుంది’ అని మండిపడింది.
Similar News
News December 15, 2025
ICC ప్లేయర్స్ ఆఫ్ ది మంత్గా షెఫాలీ, హార్మర్

ఈ ఏడాది వన్డే WC ఫైనల్లో రాణించిన భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (నవంబర్) అవార్డు గెలుచుకున్నారు. ప్రతీకా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన వర్మ.. ఫైనల్లో 87 రన్స్&2 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలకమయ్యారు. మరోవైపు పురుషుల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్నారు. టీమ్ ఇండియాతో జరిగిన రెండు టెస్టుల్లో ఆయన 17 వికెట్లు తీశారు.
News December 15, 2025
ఒకే రోజు రెండుసార్లు పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ <<18569611>>ఉదయం<<>> నుంచి రెండుసార్లు బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,470 పెరిగి రూ.1,35,380కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,940 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,24,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 15, 2025
ధరలు మార్చకుండా ప్రయోజనాలు తగ్గించిన AIRTEL

ఎయిర్టెల్ తన అన్లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్ల డేటా ప్రయోజనాలను గణనీయంగా తగ్గించింది. ₹51, ₹101, ₹151 ప్యాక్లపై గతంలో లభించిన 3GB, 6GB,9GB డేటా ఇప్పుడు 1GB, 2GB,3GBకు తగ్గించింది. ధరలు మారనప్పటికీ డేటా తగ్గడంతో వినియోగదారులకు నష్టం కలగనుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ప్యాక్ల ప్రయోజనాలనూ ఇలానే తగ్గించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.


