News April 22, 2024
ఈవీఎం సడెన్గా మొరాయిస్తే..?

ఎన్నికల వేళ ‘EVM మొరాయిస్తే’ అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఓటింగ్ జరుగుతుండగా ఈవీఎం అకస్మాత్తుగా పని చేయకపోతే వెంటనే కొత్త బ్యాలెట్ యూనిట్ను అక్కడికి పంపిస్తారు. అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్లోనూ నమోదై ఉంటాయి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్పులూ అందుబాటులో ఉంటాయి. కౌంటింగ్ రోజున అన్ని EVMలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. బ్యాటరీ సాయంతో నడిచే EVMలను విద్యుత్ లేని ప్రాంతాల్లోనూ వినియోగించొచ్చు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్కు బ్రాండ్ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


