News April 22, 2024
ఈవీఎం సడెన్గా మొరాయిస్తే..?

ఎన్నికల వేళ ‘EVM మొరాయిస్తే’ అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఓటింగ్ జరుగుతుండగా ఈవీఎం అకస్మాత్తుగా పని చేయకపోతే వెంటనే కొత్త బ్యాలెట్ యూనిట్ను అక్కడికి పంపిస్తారు. అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్లోనూ నమోదై ఉంటాయి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్పులూ అందుబాటులో ఉంటాయి. కౌంటింగ్ రోజున అన్ని EVMలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. బ్యాటరీ సాయంతో నడిచే EVMలను విద్యుత్ లేని ప్రాంతాల్లోనూ వినియోగించొచ్చు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 21, 2026
IPL-2026కి భారత బౌలర్ దూరం!

IPL-2026కి KKR ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా దూరమైనట్లు CricBuzz పేర్కొంది. ఆయన టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఫ్రాంచైజీ అధికారి ఒకరు తమతో చెప్పారని వెల్లడించింది. కాగా గత ఏడాది జరిగిన మినీ వేలంలో KKR ఆయన్ను రూ.కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేసర్ హర్షిత్ రానా దూరమవ్వగా పతిరణ ఆడటంపైనా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
News March 21, 2026
కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.
News March 21, 2026
మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు: సీఎం మమత

బెంగాల్ ఎన్నికల్లో అక్రమ వలసల అంశం బీజేపీకి ప్రచారాస్త్రంగా మారిన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీనిపై కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని.. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని విమర్శించారు. కోల్కతాలోని ఈద్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే SIRపైనా మమత విమర్శలు గుప్పించారు. BJP ప్రజల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


