News July 9, 2024

పరీక్షలు వాయిదా వేస్తే యువతకే నష్టం: సీఎం రేవంత్

image

TG: DSC, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్లపై CM రేవంత్ మహబూబ్‌నగర్ సభలో ధ్వజమెత్తారు. ‘పరీక్షలు తరచూ వాయిదా వేస్తే యువత నష్టపోతుంది. త్వరగా పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రానివారు మరో ఉద్యోగం చూసుకుంటారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే.. కోర్టు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తుంది. పదేపదే పరీక్షలను రద్దు చేయించాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది’ అని CM ఆరోపించారు.

Similar News

News November 16, 2025

రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CBN

image

AP: బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘చాయ్‌వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారంటే రాజ్యాంగం వల్లే. మన రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయవ్యవస్థ కీలక బాధ్యత పోషిస్తోంది’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, CJI పాల్గొన్నారు.

News November 16, 2025

చంద్రబాబూ.. ఇదేనా మీ విజన్: జగన్

image

AP: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉందని YS జగన్ ఆరోపించారు. 2025-26 FY తొలి 6 నెలల CAG గణాంకాలను Xలో షేర్ చేశారు. రెండేళ్ల కాలానికి పన్నుల వృద్ధి CAGR కేవలం 2.75% ఉండగా, ప్రభుత్వం పేర్కొంటున్న 12-15% వృద్ధి పూర్తిగా అవాస్తవమని విమర్శించారు. తమ హయాంలో పన్నుల వృద్ధి 9.87% ఉందన్నారు. కూటమి ప్రభుత్వ అప్పులు మాత్రం భారీగా పెరిగి రూ.2,06,959 కోట్లకు చేరాయని వెల్లడించారు.

News November 16, 2025

IPL 2026 వేలానికి స్టార్ ప్లేయర్లు

image

వచ్చే IPL సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దీంతో స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్ , లివింగ్‌స్టోన్ వంటి ప్లేయర్లు బిడ్డింగ్‌లో టార్గెట్ కానున్నారు. అదే విధంగా పతిరణతో పాటు జోష్ ఇంగ్లిస్, బిష్ణోయి, జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్‌ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు కూడా మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.