News August 4, 2024
జనరల్ బోగీ ఎక్కితే చుక్కలే..!

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైల్వే సామాన్యులకు దూరమవుతోంది. ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా AC బోగీలు పెంచుతూ, జనరల్ బోగీలు తగ్గించడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్ బోగీలను 4 నుంచి ఒకటికి తగ్గించడంతో ప్రయాణం నరకమైంది. ఒకే ఒక్క బోగీ కావడంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది టాయిలెట్ల వరకూ కూర్చుని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
Similar News
News April 8, 2026
ఇరాన్కు ఆయుధాలు ఇస్తే 50% టారిఫ్: ట్రంప్

ఇరాన్తో సీజ్ఫైర్ కొనసాగుతున్న వేళ ఇతర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50% టారిఫ్స్ విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
News April 8, 2026
టెన్త్, ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే APలో ఈ నెల 3వ వారంలో ఇంటర్, నెలాఖరున టెన్త్ రిజల్ట్స్ వస్తాయని సమాచారం. TGలో ఈ నెల 10లేదా12వ తేదీ అని ప్రచారం జరిగినా 15-20వ తేదీ లోపు ఇంటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సుంది. అటు టెన్త్ పరీక్షలు ఇంకా ముగియలేదు. పూర్తైన పేపర్ల వాల్యుయేషన్ జరుగుతుండటంతో ఈ నెలాఖరుకే ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.
News April 8, 2026
చిన్న పొరపాటు.. పెద్ద సీటుకు గండి!

నామినేషన్లో <<19598336>>అభ్యర్థుల<<>> పొరపాటుతో విజయ్ TVK ముఖ్యమైన స్థానంలో పోటీచేసే ఛాన్స్ కోల్పోయింది. గుర్తింపు లేని పార్టీ అభ్యర్థికి నామినేషన్లో మద్దతుగా కనీసం 10 సంతకాలు ఉండాలి. ఎడప్పాడిలో TVK అది మిస్ చేసి సీటుకే ఎసరు తెచ్చుకుంది. TN మాజీ సీఎం, AIADMK చీఫ్ పళనిస్వామి పోటీ చేస్తున్న ఈ చోట రాణించుంటే TVKకి రాజకీయంగా కలిసొచ్చేది. దీంతో మొత్తం 234 సీట్లు కాగా ఇప్పుడు 233 చోట్ల పోటీ చేయనుంది. <<-se>>#Elections2026<<>>


