News August 4, 2024

జనరల్ బోగీ ఎక్కితే చుక్కలే..!

image

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైల్వే సామాన్యులకు దూరమవుతోంది. ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా AC బోగీలు పెంచుతూ, జనరల్ బోగీలు తగ్గించడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్ బోగీలను 4 నుంచి ఒకటికి తగ్గించడంతో ప్రయాణం నరకమైంది. ఒకే ఒక్క బోగీ కావడంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది టాయిలెట్ల వరకూ కూర్చుని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

Similar News

News November 4, 2025

APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) 6 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc( అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్), పీజీ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ) అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 4, 2025

డ్రైవరన్నా.. వేగం తగ్గించు!

image

TG: ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం వేగంగా వెళ్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, ఒత్తిడికి గురవుతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.

News November 4, 2025

వరి కోతలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

image

వరి వెన్నులో 80-90% గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలి. ఈ దశలో గింజల్లో తేమ 18-24% వరకు ఉంటుంది. గింజలు పూర్తిగా ఎండే వరకు ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గి, గింజలపై పగుళ్లు ఏర్పడి ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక శాతం పెరుగుతుంది. గింజలలో తేమ శాతం తగ్గించడానికి పనలను 4 నుంచి 5 రోజులు చేనుపై ఎండనివ్వాలి. పనలను తిరగతిప్పితే సమానంగా ఎండుతాయి.