News October 16, 2024

బియ్యాన్ని నానబెట్టి వండితే..

image

బియ్యాన్ని నానబెట్టి వండితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
*జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
*బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
**ఎక్కువ సేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని చెబుతున్నారు.

Similar News

News October 19, 2025

ఆరోగ్యం కోసం ‘ధన్వంతరీ మంత్రం’

image

న‌మామి ధన్వంతరిమ్ ఆది దేవం
సురాసురైహి వందిత పాదపద్మం
లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం
దాతారం ఈశం స‌క‌ల‌ ఔషధీనాం
ఈ మంత్రం ధన్వంతరి స్వామివారిని కీర్తిస్తుంది. ఆయన జయంతి రోజున ఈ మంత్రాన్ని చదవడం వల్ల సకల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర దినాన మందులు దానం చేయడం, నిస్సహాయులకు ఔషధాలను అందించడం వల్ల దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని చెబుతారు.

News October 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్‌లాండ్ ప్లేయర్ అన్యాపత్‌తో అమీతుమీ

News October 19, 2025

ధన్వంతరీ ఎవరు?

image

క్షీరసాగర మథనంలో జన్మించిన వారిలో ధన్వంతరి ఒకరు. ఆయన మహా విష్ణువు అంశ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఆ రోజును ధన్వంతరి జయంతిగా జరుపుకొంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ధన్వంతరి, సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేద జ్ఞానాన్ని పొందిన 16 మంది శిష్యులలో ఒకరు. ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దైవంగా పూజించే ఆయనను స్మరించడం, ఆరాధించడం సకల రోగాల విముక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.