News January 15, 2025
దేశంలో ఎన్నో సమస్యలుంటే.. సైకిల్ ట్రాక్లు కావాలా?: సుప్రీంకోర్టు

‘దేశంలో పేదలకు సరైన నివాస వసతి లేదు. మురికివాడల్లో నివసిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవల కొరత ఉంది. ప్రభుత్వాలు వీటి కోసం నిధులు ఖర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్ల కోసమా?’ అని SC ప్రశ్నించింది. దేశంలో సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలన్న పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామని SC ప్రశ్నించింది.
Similar News
News December 28, 2025
శబరిమల ఆలయం మూసివేత.. రీఓపెన్ ఎప్పుడంటే?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజా కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న 5PMకు ఆలయం తెరుస్తామని చెప్పింది. మరోవైపు ఇప్పటిదాకా 30 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ₹333 కోట్ల ఆదాయం టెంపుల్కు వచ్చింది.
News December 28, 2025
ఉక్రెయిన్ ఒప్పుకోకున్నా మా ‘లక్ష్యం’ సాధిస్తాం: పుతిన్

రెండు దేశాల మధ్య వివాదాన్ని శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ త్వరపడటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఇందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యేక సైనిక చర్య ద్వారా బలవంతంగానైనా అన్ని లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు. 500 డ్రోన్లు, 40 మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కమాండ్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా సైనిక దుస్తుల్లో పుతిన్ కనిపించారు.
News December 28, 2025
బుల్డోజర్ వివాదం.. సీఎం Vs సీఎం

బెంగళూరులో ఇళ్ల కూల్చివేత కర్ణాటక, కేరళ CMల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ‘నార్త్ బుల్డోజర్ జస్టిస్’ను కర్ణాటక అనుసరిస్తోందని కేరళ CM విజయన్ ఆరోపించారు. ముస్లిం ఇళ్ల కూల్చివేతలు మైనారిటీ వ్యతిరేక రాజకీయాలకు ఉదాహరణని మండిపడ్డారు. ‘ఆయనవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు. వాస్తవ పరిస్థితిపై అవగాహన లేకుండా మాట్లాడారు. బుల్డోజర్ న్యాయానికి, ఆక్రమణల తొలగింపునకు తేడా ఉంది’ KA CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు.


