News January 15, 2025
దేశంలో ఎన్నో సమస్యలుంటే.. సైకిల్ ట్రాక్లు కావాలా?: సుప్రీంకోర్టు

‘దేశంలో పేదలకు సరైన నివాస వసతి లేదు. మురికివాడల్లో నివసిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవల కొరత ఉంది. ప్రభుత్వాలు వీటి కోసం నిధులు ఖర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్ల కోసమా?’ అని SC ప్రశ్నించింది. దేశంలో సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలన్న పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామని SC ప్రశ్నించింది.
Similar News
News December 16, 2025
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభ సమయంలో Sensex సుమారు 300 పాయింట్లు పడిపోయి 84,900 స్థాయికి దిగివచ్చింది. Nifty కూడా 100 పాయింట్లకు పైగా నష్టపోయి 25,950 కంటే దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సోమవారం కూడా మార్కెట్లు నష్టాల్లోనే కూరుకుపోగా.. ఈరోజూ అదే ధోరణి కొనసాగుతోంది. ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ మార్కెట్ దిశపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News December 16, 2025
ప్రసారభారతిలో ఉద్యోగాలు

ప్రసార భారతి, న్యూఢిల్లీలో 16 కాస్ట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. CMA ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాస్ట్ ట్రైనీలకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి సంవత్సరం రూ.15,000, రెండో సంవత్సరం రూ.18,000, మూడో సంవత్సరం రూ.20,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://prasarbharati.gov.in
News December 16, 2025
సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.


