News December 3, 2024
ఆందోళన చేపడితే ఆదివారం సభ పెడతా: ఓం బిర్లా

వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే లోక్సభను ఆదివారాలూ నడిపిస్తానని స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. నష్టపోయిన సమయం మేరకు ఇలా నిర్వహిస్తానని తెలిపారు. అదానీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో క్రితంవారం సభ సాగలేదు. దీంతో ఉభయ సభల్లోనూ రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. ‘డిసెంబర్ 14న 11AMకు సభ మొదలవుతుంది. మళ్లీ వాయిదాలు పడితే సభ్యులు ఆదివారాలూ రావాల్సి వస్తుంది’ అని అన్నారు.
Similar News
News December 10, 2025
అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 10, 2025
మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT


