News December 3, 2024

ఆందోళన చేపడితే ఆదివారం సభ పెడతా: ఓం బిర్లా

image

వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే లోక్‌సభను ఆదివారాలూ నడిపిస్తానని స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. నష్టపోయిన సమయం మేరకు ఇలా నిర్వహిస్తానని తెలిపారు. అదానీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో క్రితంవారం సభ సాగలేదు. దీంతో ఉభయ సభల్లోనూ రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. ‘డిసెంబర్ 14న 11AMకు సభ మొదలవుతుంది. మళ్లీ వాయిదాలు పడితే సభ్యులు ఆదివారాలూ రావాల్సి వస్తుంది’ అని అన్నారు.

Similar News

News December 2, 2025

KMR: మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఎం

image

తాడ్వాయి మండలం దేమి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి నేడు పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి మక్కల కొనుగోలు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

News December 2, 2025

నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని: రవిశాస్త్రి

image

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 0-2తో భారత్ కోల్పోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ విషయంలో గంభీర్‌ను ప్రొటెక్ట్ చేయనని అన్నారు. ‘అతడు 100% బాధ్యత వహించాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఓటమికి మొదటి బాధ్యతను తీసుకునే వాడిని. నిజానికి టీమ్ కూడా అంత ఘోరంగా లేదు. కానీ గువాహటిలో 100-1 నుంచి 130-7కి పడిపోయారు. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

News December 2, 2025

సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

image

సౌత్ సెంట్రల్ రైల్వే(<>సికింద్రాబాద్<<>>)లో స్కౌట్స్& గైడ్స్ కోటాలో 14 గ్రూప్ D, గ్రూప్ C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, టెన్త్/ITI/NAC ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, EWS, మహిళలకు రూ.250. రాత పరీక్ష, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: scr.indianrailways.gov.in