News December 3, 2024
ఆందోళన చేపడితే ఆదివారం సభ పెడతా: ఓం బిర్లా

వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే లోక్సభను ఆదివారాలూ నడిపిస్తానని స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. నష్టపోయిన సమయం మేరకు ఇలా నిర్వహిస్తానని తెలిపారు. అదానీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో క్రితంవారం సభ సాగలేదు. దీంతో ఉభయ సభల్లోనూ రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. ‘డిసెంబర్ 14న 11AMకు సభ మొదలవుతుంది. మళ్లీ వాయిదాలు పడితే సభ్యులు ఆదివారాలూ రావాల్సి వస్తుంది’ అని అన్నారు.
Similar News
News April 1, 2026
పెరగనున్న మారుతీ కార్ల ధరలు!

తమ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల కమొడిటీ ధరలు పెరగడం, గతేడాది GST తగ్గింపు వల్ల వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోవడమే అందుకు కారణమని వివరించింది. కార్ల తయారీలో వాడే ఆయిల్, గ్యాస్ సహా కీలక లోహాల ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు సప్లైలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. రాబోయే రోజుల్లో ఉండొచ్చని అంచనా వేసింది.
News April 1, 2026
కేజీబీవీ దరఖాస్తు గడువు 10వరకు పొడిగింపు

AP: KGBV స్కూళ్లలో 2026-27లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగిస్తున్నట్లు SSA ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 6, 11 తరగతుల్లో అన్ని సీట్లతో పాటు 7, 8, 9, 10, 12 క్లాసుల్లో ఖాళీ సీట్లకు బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుకు ఇవాళ్టితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు పెంచినట్లు చెప్పారు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలన్నారు. ఇక్కడ <
News April 1, 2026
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్

TG: విద్యుత్ వినియోగదారులందరికీ శుభవార్త. 2026లో గృహ అవసరాలకు వాడే విద్యుత్కు ఛార్జీల పెంపు లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నాన్- డొమెస్టిక్ వినియోగదారులకు పీక్ అవర్స్లో వర్తించే ToD (Time of Day) ఛార్జీని యూనిట్కు రూ.1 నుంచి రూ.1.50కి పెంచింది. అటు కరెంట్ షాక్కు గురైన వారికి అందించే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది.


