News March 21, 2024

ముక్క లేకపోతే ముద్ద దిగట్లేదు..

image

దేశంలో మాంస ప్రియుల సంఖ్య పెరిగిపోతోంది. 2015లో 74% మంది మాంసాహారులు ఉండగా, 2021 నాటికి 77 శాతానికి చేరినట్లు స్టాటిక్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. లక్షద్వీప్‌లో 100%, ఈశాన్య రాష్ట్రాల్లో 99%, కేరళలో 98%, పుదుచ్చేరిలో 97%, తమిళనాడులో 96.4% మంది మాంసాహారులు ఉన్నట్లు తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 96% మందికి ముక్కలేనిదే ముద్ద దిగట్లేదట. 7-15 రోజుల్లో ఒక్కసారైనా మాంసం తింటున్నారని పేర్కొంది.

Similar News

News November 20, 2025

26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

image

రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. రైతుల ఢిల్లీ మార్చ్‌కు ఐదేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ‘నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. MSP, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి వాటిని పట్టించుకోలేదు’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే మండిపడ్డారు.

News November 20, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*శ్రీకాకుళం(D) ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేసేందుకు ICMR ఆమోదం తెలిపింది. మూడేళ్లలో పరిశోధన పూర్తి చేసేందుకు రూ.6.2 కోట్లు ఇవ్వనుంది: మంత్రి సత్యకుమార్
*వైసీపీ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారు. జ‌గ‌న్ చేసిన మంచి ప‌నుల‌కు త‌న స్టాంప్ వేసుకుని క్రెడిట్ చోరీ చేయాల‌ని ఆలోచిస్తున్నాడు: కన్నబాబు
*ఇవాళ బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న CM చంద్రబాబు, మంత్రి లోకేశ్.

News November 20, 2025

‘కొదమసింహం’ నాకు, చరణ్‌కు ఫేవరేట్ మూవీ: చిరంజీవి

image

తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘కొదమసింహం సినిమాలో నా స్టిల్ చాలా పాపులర్. తొలిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. నాకు, రామ్ చరణ్‌కు ఫేవరేట్ మూవీ’ అని తెలిపారు. కొదమసింహం సినిమాను ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా చిరంజీవి గుర్తుచేసుకున్నారు.