News May 12, 2024
ఓటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు: ముకేశ్ కుమార్

AP: ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. ‘సీవిజిల్’ యాప్లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రలోభాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. అర్బన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వందశాతం పోలింగ్ అయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 10, 2026
BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల శాలరీలివే!

భారత క్రికెట్ జట్టు ప్లేయర్లకు <<19095739>>BCCI<<>> తాజాగా 3 గ్రేడ్లలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. గ్రేడ్-Aలో ఉన్న ఆటగాళ్లకు రూ.5కోట్లు చెల్లించనుంది. గ్రేడ్-B క్రికెటర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్-C క్రికెటర్లకు రూ. కోటి చొప్పున ఇవ్వనుంది. దీంతో పాటు మ్యాచ్ ఫీజులు అదనం. తాజా కాంట్రాక్ట్లో గ్రేడ్-Bకు డిమోట్ అయిన రోహిత్, విరాట్ రూ.3 కోట్ల చొప్పున అందుకోనున్నారు. గతంలో ఉన్న A+ గ్రేడ్ను BCCI తొలగించింది.
News February 10, 2026
ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
News February 10, 2026
స్పీకర్పై అవిశ్వాసం.. మెజార్టీ ఉంటేనే!

లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 94-C కింద తీర్మానం ప్రవేశ పెట్టాలి అంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. సభలోని 50 మంది సభ్యులు మద్దతుతో నోటీసు ఇచ్చాక చర్చకు నిర్దేశిస్తారు. 10 రోజుల్లోపే చర్చ చేపట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. మెజార్టీ ఆధారంగా అనర్హత వేటు ఉంటుంది. కాగా లోక్సభలో NDAకే మెజార్టీ ఉండటంతో స్పీకర్ తొలగింపు అసాధ్యమే.


