News October 26, 2024
దేవాలయాల జోలికి వస్తే ఊరుకోం: మల్లాది

AP: హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. దేవాలయాలు జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో గోశాలను కూల్చివేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామనే వారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. గతంలో పుష్కరాల సమయంలోనూ చంద్రబాబు అనేక దేవాలయాలను కూల్చివేయించారని దుయ్యబట్టారు.
Similar News
News January 30, 2026
418 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 30, 2026
అమరావతిలో వీధి పోటు పాట్లు… పరిష్కారానికి GO

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను కొత్త సమస్య వెంటాడుతోంది. రిటర్న్బుల్ ప్లాట్లు అందుకున్న పలువురికి వీధిపోటు తలనొప్పిగా మారింది. వాస్తుప్రకారం వీధిపోటు ఉంటే ప్రతికూలత, అశుభం అనే భావన ఉండడంతో వాటిని మార్చాలని వారు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. దీంతో పడమర, నైరుతి, దక్షిణం, ఆగ్నేయం దిక్కులు, ఇతర చోట్ల వీధి శూలలున్న ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేలా ప్రభుత్వం GO ఇచ్చింది.
News January 30, 2026
16ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధించండి: సోనూసూద్

సోషల్ మీడియా వినియోగంపై నటుడు సోనూసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు భోజనం చేస్తూ ఫోన్లలో మునిగిపోవడం ఆందోళనకరమని, 16 ఏళ్ల లోపు వారికి SMను నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. AP ఈ దిశగా అడుగులు వేసిందని, గోవా కూడా అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిని జాతీయ ఉద్యమంగా మార్చాలని సోనూసూద్ X వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్?


