News March 30, 2025
నాగరికత, సంస్కృతి మరిచిపోతే ఉనికిని కోల్పోతాం: చంద్రబాబు

AP: ఉగాది.. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. 25ఏళ్లలో అమెరికన్ల కంటే రెండింతల ఆదాయాన్ని తెలుగుజాతి సంపాదించింది. నాగరికత, సంస్కృతి మరిచిపోతే ఉనికిని కోల్పోతాం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారమవుతాయి. కూటమి ప్రభుత్వం నాగరికత, సంస్కృతిని అనుసంధానిస్తూ ముందుకెళ్తోంది’ అని అన్నారు.
Similar News
News April 1, 2025
గిగ్ వర్కర్ల కోసం ‘AC రెస్ట్ రూమ్స్’

వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఫుడ్, ఆన్లైన్ డెలివరీలు చేస్తూ ఇబ్బందిపడే గిగ్ వర్కర్ల కోసం చెన్నై కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు చెన్నైలోని ప్రధాన రోడ్లపై ‘AC రెస్ట్ రూమ్స్’ను ఏర్పాటు చేయనుంది. స్విగ్గీ, జొమాటో, ఉబర్ డెలివరీ పార్ట్నర్స్ వీటిని ఉపయోగించుకోనున్నారు. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. HYDలోనూ ఇలాంటి ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది.
News April 1, 2025
రోహిత్ కాబట్టే ఇంకా జట్టులో ఉన్నారు: వాన్

హిట్మ్యాన్ రోహిత్ IPLలో విఫలమవ్వడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ విమర్శలు చేశారు. ప్రస్తుతం అతను కెప్టెన్ కాదని, కేవలం బ్యాట్స్మెన్ మాత్రమేనని పేర్కొన్నారు. రోహిత్ కాకుండా మరొకరు ఇలా తక్కువగా రన్స్ చేస్తే టీమ్ నుంచి బయటకు పంపేవారని చెప్పారు. అలాగని తాను రోహిత్ను టీం నుంచి డ్రాప్ కావాలని కోరుకోవట్లేదన్నారు. అయితే తిరిగి హిట్మ్యాన్ త్వరగా ఫామ్ అందుకొని జట్టుకు విజయాలు అందించాలని కోరారు.
News April 1, 2025
CBSE సిలబస్లో కీలక మార్పులు

సీబీఎస్ఈ 10 నుంచి 12 తరగతుల సిలబస్లో కీలక మార్పులు చేసింది. 2025-26 అకడమిక్ ఇయర్ నుంచి అన్ని అనుబంధ స్కూల్స్లో అప్డేటెడ్ సిలబస్ అందుబాటులోకి రానుంది. విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు తగినట్లు సిద్ధం చేయడం, మరింత క్రియాశీల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మార్పులు చేసినట్లు బోర్డు పేర్కొంది. వినూత్న పద్ధతిలో బోధించాలని, గైడ్లైన్స్ పకడ్బందీగా అమలు చేయాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.