News April 19, 2024

మరోసారి గెలిస్తే రెండేళ్లలో నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా

image

ప్రధాని మోదీని మరోసారి గెలిపిస్తే దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ‘అధికారంలోకి వచ్చిన ఏడాది లేదా రెండేళ్లలోనే నక్సలిజాన్ని అంతం చేస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో BJP సర్కార్ రాగానే 90 రోజుల్లోనే 86 మంది నక్సల్స్ హతమయ్యారు. 126 మంది అరెస్ట్ కాగా 250 మంది సరెండర్ అయ్యారు’ అని తెలిపారు. కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోలు హతమైన నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News

News December 1, 2025

పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్‌సభ

image

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్‌సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.