News March 24, 2025
రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే డకౌట్

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ డకౌటయ్యారు. ఈ టోర్నీలోనే అత్యధిక ధర(రూ.27కోట్లు) వెచ్చించి ఆయనను కొనుగోలు చేశారు. తొలి మ్యాచులో 6 బంతులు ఎదుర్కొన్న ఆయన సున్నాకే వెనుదిరిగారు. దీంతో రూ.27 కోట్లు పెడితే ఇలాగేనా ఆడేది అని పలువురు ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
Similar News
News March 27, 2025
జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్ను వాజ్పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.
News March 27, 2025
అందరం అవయవదానం చేద్దాం.. సభలో కేటీఆర్ ప్రతిపాదన

TG: ఆర్గాన్ డొనేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కీలక ప్రతిపాదన చేశారు. సభ్యులంతా అవయవదానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. సభ నుంచే ప్రజలకు మంచి సందేశం పంపాలని ఆయన అన్నారు.
News March 27, 2025
అమిత్షాపై ప్రివిలేజ్ నోటీసు తిరస్కరించిన RS ఛైర్మన్

HM అమిత్ షాపై కాంగ్రెస్ ఇచ్చిన సభా హక్కుల తీర్మానం నోటీసును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. సోనియా గాంధీపై ఆయన విమర్శల్లో తప్పేమీ లేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రెసిడెంటుగా సోనియా గాంధీ విపత్తు నిధి డబ్బులను వాడుకున్నారు. PMNRF కమిటీలో PM, కాంగ్రెస్ Prez ఉండేలా అప్పటి PM నెహ్రూ ప్రకటించారు’ అని 1948 నాటి ప్రెస్ రిలీజును షా కోట్ చేశారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించానని ధన్ఖడ్ తెలిపారు.