News October 26, 2024
త్వరలోనే లష్కర్లు, హెల్పర్ల నియామకం: ప్రభుత్వం

TG:ప్రధాన కాలువలు, డ్యామ్లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ, గేట్ల ఆపరేషన్ కోసం 1597 మంది లష్కర్లు, 281 మంది హెల్పర్లను ప్రభుత్వం త్వరలో నియమించుకోనుంది. చదవడం, రాయడం వస్తే ఉంటున్న గ్రామంలోనే ఔట్సోర్సింగ్ జాబ్ చేయవచ్చు. జీతం ₹15,600. విద్యార్హతతో సంబంధం లేకుండా 45 ఏళ్లలోపు, ఫిట్గా ఉన్న వారిని తీసుకుంటారు. ప్రాజెక్టులు, చెరువుల నుంచి నీరు పొలానికి చేరుతుందా? గండ్లు పడ్డాయా? అనే వివరాలు వీరు సేకరిస్తారు.
Similar News
News December 11, 2025
అఖండ-2 టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్

అఖండ-2 సినిమా <<18531616>>నిర్మాతలకు<<>> తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అటు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ మొదలవనుండగా ఇప్పటికే అభిమానులు రూ.600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు.
News December 11, 2025
భారత సంగీతానికి ప్రపంచ కీర్తి తెచ్చిన గాయని

సంగీత ప్రపంచంలో మొదటగా భారతరత్న అవార్డు, రామన్ మెగసెసే పురస్కారం పొందిన మొదటి కళాకారిణి MS సుబ్బులక్ష్మి. 1916 సెప్టెంబరు 16న మదురైలో జన్మించిన ఆమె తన మధురగానంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆ మహాగాయిని వర్థంతి నేడు. లండన్లో క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో పాడి శ్రోతలను తన స్వరంతోనే కట్టి పడేసి భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సుబ్బులక్ష్మి గారిది.
News December 11, 2025
IPL మినీ వేలం.. తొలి సెట్ ఇదే..

ఈ నెల 16న అబుదాబీలో IPL మినీ వేలం జరగనుంది. తొలి సెట్లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో డెవాన్ కాన్వే, జాక్ ఫ్రేజర్, కామెరూన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా ఉన్నారు. సర్ఫరాజ్, పృథ్వీ షా ధరను రూ.75లక్షలుగా, మిగతా వారి బేస్ ప్రైజ్ను రూ.2కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ వేలంలో గ్రీన్ అత్యధిక ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలంటున్నాయి.


